జిల్లాలో 238 కరోనా పాజిటివ్‌ కేసులు

ABN , First Publish Date - 2021-05-09T03:49:36+05:30 IST

జిల్లాలో శనివారం 238 కరోనా కేసులు నమోదయ్యాయి. జిల్లాలోని 29 ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిర్వహించిన పరీక్షల్లో 213 పాజిటివ్‌గా నిర్ధారణ కాగా ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షల్లో 25 పాజిటివ్‌లు వచ్చాయి.

జిల్లాలో 238 కరోనా పాజిటివ్‌ కేసులు

కామారెడ్డి టౌన్‌, మే 8: జిల్లాలో శనివారం 238 కరోనా కేసులు నమోదయ్యాయి. జిల్లాలోని 29 ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిర్వహించిన పరీక్షల్లో 213 పాజిటివ్‌గా నిర్ధారణ కాగా ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షల్లో 25 పాజిటివ్‌లు వచ్చాయి.  ఇందులో కామారెడ్డి 22, బాన్సువాడ 10, ఎల్లారెడ్డి 8, దోమకొండ 10, మద్నూర్‌ 2, పిట్లం 8, బిచ్కుంద 7,  అన్నారం 7, భిక్కనూరు 6, బీబీపేట 12, ఎర్రాపహాడ్‌ 3, రామారెడ్డి 13, రాజంపేట 3, మాచారెడ్డి 7, ఎస్‌ఎస్‌నగర్‌ 7, దేవునిపల్లి 7, రాజీవ్‌నగర్‌ 14, నాగిరెడ్డిపేట 16, మత్తమాల్‌ 5, లింగంపేట 4, ఉత్తునూర్‌ 11, బీర్కూర్‌ 8, హన్మాజీపేట 9, నిజాంసాగర్‌ 8, పెద్దకొడప్‌గల్‌ 6 కేసులు నమోదయ్యాయి. లింగం పేట మండల కేంద్రంలో శనివారం కరోనాతో 50 ఏళ్ల వ్యక్తి మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. తాడ్వాయిలో 48ఏళ్ల వ్యక్తి కరోనాతో మృతి చెంది నట్టు గ్రామస్థులు తెలిపారు. గత పది రోజుల క్రితం కరోనా బారిన పడి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు.

Updated Date - 2021-05-09T03:49:36+05:30 IST