అత్త మందలించిందని కోడలు ఆత్మహత్య
ABN , First Publish Date - 2021-05-04T12:28:46+05:30 IST
మనస్తాపంతో ఓ కోడలు ఆత్మహత్య చేసుకుంది.
హైదరాబాద్/మెహిదీపట్నం : మనస్తాపంతో ఓ కోడలు ఆత్మహత్య చేసుకుంది. గోల్కొండ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్రెడ్డి తెలిపిన వివరాలు ప్రకారం... గోల్కొండ రేషన్బాగ్కు చెందిన సయ్యద్ అబీబ్ భార్య బీబీ(24)చాయ్లో టీపొడి ఎక్కువ వేయడంతో అత్త నబియా మందలించింది. దీంతో మనస్తాపానికి గురైన బీబీ తన గదిలోకి వెళ్లి చున్నీతో ఫ్యాన్కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. బీబీకి సయ్యద్ అబీబ్తో 2018లో వివాహం జరిగింది. వీరికి ఒక కూతురు. తరచూ అత్త కోడళ్లు మధ్య వాగ్వావాదం జరిగేది. భర్త ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.