25 కరోనా కేసులు
ABN , First Publish Date - 2021-03-07T04:39:00+05:30 IST
పక్కనే ఉన్న మహారాష్ట్రలో కుదిపేస్తున్న కరోనా మహమ్మారి ఆదిలాబాద్ జిల్లాపై మళ్లీ పంజా విసురుతుంది. శుక్రవారం జిల్లాలో 31 కేసులు పాజిటివ్గా నమోదు కాగా, శనివారం 25 కేసులు నమోదయ్యాయి.
ఆదిలాబాద్అర్బన్, మార్చి6:పక్కనే ఉన్న మహారాష్ట్రలో కుదిపేస్తున్న కరోనా మహమ్మారి ఆదిలాబాద్ జిల్లాపై మళ్లీ పంజా విసురుతుంది. శుక్రవారం జిల్లాలో 31 కేసులు పాజిటివ్గా నమోదు కాగా, శనివారం 25 కేసులు నమోదయ్యాయి. అ ధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం... శనివారం 699 మందికి పరీక్షలు నిర్వ హించగా 25 కేసులు పాజిటివ్గా నమోదయ్యాయి. 668 నెగెటివ్ కేసులు కాగా 4 పరీక్షలు పెండింగ్లో ఉన్నాయి. ప్రస్థుతం 201 మంది హోంక్వారంటైన్లో ఉండగా రిమ్స్లో 9 మంది చికిత్సలు పొందుతున్నారు. రోజురోజుకూ జిల్లాలో మళ్లీ కరోనా విజృంభించడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఒకవైపు వ్యాక్సిన్ అం దుబాటులోకి వచ్చినప్పటికీ కేసులు పెరుగడం ఈ ఆందోళన కలిగిస్తుంది. జిల్లాలో పాజిటివ్ కేసులు పెరగడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.