ఈఏపీ సెట్‌కు 2.5లక్షల దరఖాస్తులు

ABN , First Publish Date - 2021-07-26T09:01:33+05:30 IST

ఇంజనీరింగ్‌, అగ్రికల్చర్‌ అండ్‌ ఫార్మసీ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (ఈఏపీ సెట్‌)కు దాదాపు 2.5 లక్షల దరఖాస్తులు ఆన్‌లైన్‌లో కన్వీనర్‌ కార్యాలయానికి అందాయి.

ఈఏపీ సెట్‌కు 2.5లక్షల దరఖాస్తులు

అమరావతి, జూలై 25(ఆంధ్రజ్యోతి): ఇంజనీరింగ్‌, అగ్రికల్చర్‌ అండ్‌ ఫార్మసీ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (ఈఏపీ సెట్‌)కు దాదాపు 2.5 లక్షల దరఖాస్తులు ఆన్‌లైన్‌లో కన్వీనర్‌ కార్యాలయానికి అందాయి. ఇందులో ఇంజనీరింగ్‌ 1.70 లక్షలు, అగ్రికల్చర్‌కు 0.80 వేల దరఖాస్తులు వచ్చాయి. ఎలాంటి ఆలస్య రుసుం లేకుండా నిర్దేశిత ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకునేందుకు ఆదివారంతో గడువు ముగిసింది.  సోమవారం నుంచి ఆలస్య రుసుంతో ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఆగస్టు 19 నుంచి 25 వరకు ఈఏపీ సెట్‌ నిర్వహిస్తారు.

Updated Date - 2021-07-26T09:01:33+05:30 IST