25 మంది విద్యార్థులకు Covid
ABN , First Publish Date - 2022-05-07T15:26:46+05:30 IST
తిరుప్పోరూరు సమీపం నెల్లికుప్పంలోని సత్యసాయి వైద్యకళాశాలలో 25 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ లక్షణాలు బయటపడ్డాయి. ఆ కళాశాల వసతిగృహంలో ఉంటున్న ఏడుగురికి గత నెల 30న కరోనా
చెన్నై: తిరుప్పోరూరు సమీపం నెల్లికుప్పంలోని సత్యసాయి వైద్యకళాశాలలో 25 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ లక్షణాలు బయటపడ్డాయి. ఆ కళాశాల వసతిగృహంలో ఉంటున్న ఏడుగురికి గత నెల 30న కరోనా సోకింది. వారిని ఐసోలేషన్కు పంపారు. ఈ నేపథ్యంలో గురువారం మరో 18 మంది విద్యార్థులకు పాజిటివ్ లక్షణాలు నిర్ధారణ అయ్యాయి. ఈ నేపథ్యంలో ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి రాధాకృష్ణన్, కలెక్టర్ రాహుల్నాధ్ తదితర అధికారులు శుక్రవారం ఆ కళాశాలను పరిశీలించారు.