అమ్మా నిద్ర వస్తోంది.. పడుకుంటానంటూ గదిలోకి వెళ్లి తలుపులు వేసుకున్న 25 ఏళ్ల కొడుకు.. తెల్లారేసరికి షాకింగ్ సీన్..!

ABN , First Publish Date - 2021-10-24T01:11:36+05:30 IST

రాత్రి సమయంలో కుటుంబ సభ్యులు అందరూ కలిసి భోజనం చేసేందుకు కూర్చునారు. ఈ క్రమంలో తన భోజనాన్ని త్వరగానే పూర్తి చేసిన 25ఏళ్ల కుమారుడు.. నిద్ర వస్తోందంటూ తన గదిలోకి వెళ్లి తలుపులు వేసుకున్నాడు. ఈ విషయాన్ని పెద్దగా ప

అమ్మా నిద్ర వస్తోంది.. పడుకుంటానంటూ గదిలోకి వెళ్లి తలుపులు వేసుకున్న 25 ఏళ్ల కొడుకు.. తెల్లారేసరికి షాకింగ్ సీన్..!

ఇంటర్నెట్ డెస్క్: రాత్రి సమయంలో కుటుంబ సభ్యులు అందరూ కలిసి భోజనం చేసేందుకు కూర్చునారు. ఈ క్రమంలో తన భోజనాన్ని త్వరగానే పూర్తి చేసిన 25ఏళ్ల కుమారుడు.. నిద్ర వస్తోందంటూ తన గదిలోకి వెళ్లి తలుపులు వేసుకున్నాడు. ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోని కుటుంబ సభ్యులు కూడా తమ భోజనాన్ని ముగించుకుని.. పడుకున్నారు. ఉదయం నిద్ర లేచిన సదరు యువకిడి తల్లి.. కుమారుడిని గదికి వెళ్లి ఒక్కసారిగా షాక్ అయింది. ఇంతకూ ఏం జరిగింది అనే వివరాల్లోకి వెళితే..



రాజస్థాన్‌లోని బరన్‌కు చెందిన నరేష్ (25) శుక్రవారం రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేసేందుకు కూర్చున్నాడు. అనంతరం తన భోజనాన్ని అందరికంటే ముందుగానే ముగించిన నరేష్.. ‘అమ్మా నిద్ర వస్తోంది. వెళ్లి పడుకుంటా’ అని చెప్పి తన గదిలోకి వెళ్లిపోయాడు. ఈ క్రమంలో కుటుంబ సభ్యులు కూడా తమ భోజనాన్ని పూర్తి చేసి, పడుకున్నారు. తెల్లారి చాలా సేపయినా నరేష్ తన గది నుంచి బయటకు రాకపోవడంతో.. తలుపులు తెరిచి అతడి తల్లి గదిలోకి వెళ్లింది. అనంతరం అక్కడ కనిపించిన దృశ్యాలను చూసి, షాక్ అయింది. ఉరివేసుకుని గదిలో విగత జీవిగా వేలాడుతున్న కుమారుడిని చూసి, శోకసంద్రంలో మునిగిపోయింది. ఆమె కేకలతో అక్కడకు చేరుకున్న ఇతర కుటుంబ సభ్యులు నరేష్ చనిపోయి ఉండటాన్ని చూసి, గుండెలు బాదుకుంటూ విలపించారు. కాగా.. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. నరేష్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసుకోవడంతోపాటు.. నరేష్ ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 




Updated Date - 2021-10-24T01:11:36+05:30 IST