పోలీస్ స్పందనకు 26 వినతులు
ABN , First Publish Date - 2022-05-24T07:07:51+05:30 IST
జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమానికి 26 మంది బాధితులు హాజరై నేరుగా ఎస్పీ రిషాంత్రెడ్డికి సమస్యలను మొరపెట్టుకున్నారు.
చిత్తూరు, మే 23: జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమానికి 26 మంది బాధితులు హాజరై నేరుగా ఎస్పీ రిషాంత్రెడ్డికి సమస్యలను మొరపెట్టుకున్నారు. బాధితుల సమస్యలను విన్న ఆయన పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఎస్పీ దృష్టికి వచ్చిన అర్జీల వివరాలు.. ఆస్తి తగాదాల కింద 15, వేధింపులు 2, పోలీస్ సేవలు 1, చిన్న తగాదాలు 2, కుటుంబ తగాదాలు 6 అర్జీలు అందాయి. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ శ్రీనివాసరావు, ఎస్బీ డీఎస్పీ శ్రీనివాసరెడ్డి, ఎస్ఐ మాధవ తదితరులు పాల్గొన్నారు.