వార్డు స్థానాలకు 260 నామినేషన్లు
ABN , First Publish Date - 2021-03-07T04:43:22+05:30 IST
జిల్లా వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 205 వార్డు స్థానాలకు నామినేషన్ల స్వీకరణ గడువు శనివారం ముగిసింది.
నేడు స్కూృటినీ
చిత్తూరు కలెక్టరేట్, మార్చి 6: జిల్లా వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 205 వార్డు స్థానాలకు నామినేషన్ల స్వీకరణ గడువు శనివారం ముగిసింది. వివిధ కారణాలతో ఎన్నికలు జరగని 205 వార్డు స్థానాలకు ఈనెల 15వ తేదీ పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. ఎన్నికల కమిషన్ ఇచ్చిన షెడ్యూల్ మేరకు గురువారం నుంచి శనివారం వరకు నామినేషన్ల స్వీకరించారు. గురువారం 31, శుక్రవారం 102, శనివారం 127 నామినేషన్లు అందాయి. ఆదివారం నామినేషన్ల పరిశీలన, 8న అప్పిలేట్ అధికారి వద్ద అభ్యంతరాల దాఖలు, 9న పరిశీలన, 10న ఉప సంహరణ, 15న పోలింగ్, కౌంటింగ్, ఉప సర్పంచ్ ఎన్నిక జరుగుతుంది.