27 జిల్లాల్లో తగ్గిన Covid: మరో 5 ఒమైక్రాన్‌ కేసులు

ABN , First Publish Date - 2021-12-21T17:02:51+05:30 IST

రాష్ట్రంలో 27 జిల్లాల్లో కొవిడ్‌ ప్రభావం తగ్గింది. సోమవారం 222 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. 12 జిల్లాల్లో ఒక్కకేసు కూడా నమోదు కాలేదు. 286 మంది కోలుకోగా బెంగళూరు, హాసన్‌లో ఒక్కొక్కరు మృతిచెందారు.

27 జిల్లాల్లో తగ్గిన Covid: మరో 5 ఒమైక్రాన్‌ కేసులు

బెంగళూరు: రాష్ట్రంలో 27 జిల్లాల్లో కొవిడ్‌ ప్రభావం తగ్గింది. సోమవారం 222 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. 12 జిల్లాల్లో ఒక్కకేసు కూడా నమోదు కాలేదు. 286 మంది కోలుకోగా బెంగళూరు, హాసన్‌లో ఒక్కొక్కరు మృతిచెందారు. 7074మంది చికిత్సలు పొందుతుండగా బెంగళూరులో 5,658మంది ఉన్నారు. కాగా రాష్ట్రంలో కొత్తగా మరో ఐదు ఒమైక్రాన్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో కేసుల సంఖ్య 19కు పెరిగింది. ధార్వాడకు చెందిన 54 ఏళ్ల మహిళ, భద్రావతిలో 20 ఏళ్ల యువతి, ఉడుపిలో 82 ఏళ్ల వృద్ధుడు, 72 ఏళ్ల మహిళ తో పాటు మంగళూరుకు చెందిన 19 ఏళ్ల యువతికి ఒమైక్రాన్‌ నిర్ధారణ అయింది. 

Updated Date - 2021-12-21T17:02:51+05:30 IST