ప్రేమ పెళ్లికి పెద్దలు అంగీకారం.. ఇంతలోనే యువతి..!
ABN , First Publish Date - 2021-06-22T17:40:00+05:30 IST
ఓ యువతి మల్కాజిగిరి పోలీస్స్టేషన్ పరిధిలో అదృశ్యమైంది.
హైదరాబాద్ సిటీ/ఆనంద్బాగ్ : ఓ యువతి మల్కాజిగిరి పోలీస్స్టేషన్ పరిధిలో అదృశ్యమైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మిర్జాలగూడా నివాసి కోటపల్లి అనూష(27) దిల్సుఖ్నగర్ నివాసి వెంకటేశ్వరరావులు ప్రేమించుకున్నారు. వీరి వివాహానికి పెద్దలు అంగీకరించారు. జూన్ 17న రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళుతున్నట్లు కుటుంబసభ్యులుకు చెప్పి బయటకు వెళ్లిన అనూష తిరిగి ఇంటికి చేరుకోలేదు. కుటుంబ సభ్యులు తెలిసిన చోట వెతికినా ఆమె ఆచూకీ లభించలేదు. తండ్రి కోటపల్లి కాశీనాథ్ మల్కాజిగిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.