పోలీస్‌ స్పందనకు 27 అర్జీలు

ABN , First Publish Date - 2022-05-17T06:47:37+05:30 IST

జిల్లా పోలీస్‌ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి 27 మంది నేరుగా హాజరై సమస్యలతో కూడిన వినతిపత్రాలను అందించారు.

పోలీస్‌ స్పందనకు 27 అర్జీలు
బాధితులతో మాట్లాడుతున్న ఎస్పీ రిషాంత్‌రెడ్డి

చిత్తూరు, మే 16: జిల్లా పోలీస్‌ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి 27 మంది నేరుగా హాజరై సమస్యలతో కూడిన వినతిపత్రాలను అందించారు. బాధితుల సమస్యలను ఓపిగ్గా విన్న ఎస్పీ రిషాంత్‌రెడ్డి న్యాయం, సాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఎస్పీ దృష్టికి వచ్చిన అర్జీల్లో.. ఆస్తి తగాదాల కింద 16, చిన్న తగాదాలు 2, కుటుంబ తగాదాలు 5, మిస్సింగ్‌ కింద 1, పోలీస్‌ సేవలు 1 వంతున ఫిర్యాదులు అందాయన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ డీఎన్‌ మహేష్‌, ఎస్‌ఐ మాధవ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-17T06:47:37+05:30 IST