27 నుంచి పుదువైలో విమానసేవలు

ABN , First Publish Date - 2022-03-11T16:08:42+05:30 IST

పుదుచ్చేరి లాస్‌పేట విమానాశ్రయం నుంచి విమాన సేవల పునరుద్ధరణకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 27వ తేది నుంచి విమానసేవలు పునఃప్రారంభం కానున్నాయి. 2013లో స్పైస్‌ జెట్‌, 2015లో ఎయిర్‌

27 నుంచి పుదువైలో విమానసేవలు

పుదుచ్చేరి: పుదుచ్చేరి లాస్‌పేట విమానాశ్రయం నుంచి విమాన సేవల పునరుద్ధరణకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 27వ తేది నుంచి విమానసేవలు పునఃప్రారంభం కానున్నాయి. 2013లో స్పైస్‌ జెట్‌, 2015లో ఎయిర్‌ ఇండియా లాస్‌పేట విమానాశ్రయం నుంచి బెంగుళూరుకు విమాన సేవలు ప్రారంభించాయి. తగిన స్పందన లేకపోవడంతో ఈ సేవలు నిలిపివేశారు. అనంతరం ‘ఉడాన్‌’ పథకంలో ప్రయాణికుల సగం ఛార్జీలను కేంద్రప్రభుత్వం భరించి, విమాన సంస్థలకు చెల్లిస్తుందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ పథకం కింద 2017 ఆగస్టులో స్పైస్‌ జెట్‌ సంస్థ హైదరాబాద్‌, బెంగుళూరుకు విమాన సేవలు ప్రారంభించి, అనంతరం బెంగుళూరుకు సేవలు నిలిపివేసింది. చివరగా 2020 మార్చి అనంతరం పుదుచ్చేరి నుంచి విమానాలు నడపలేదు. రెండేళ్ల అనంతరం ఈ నెల 27 నుంచి బెంగుళూరు, హైదరాబాద్‌లకు విమాన సేవలు ప్రారంభం కానున్నాయి.


Updated Date - 2022-03-11T16:08:42+05:30 IST