28 నుంచి పీజీ రెండవ దశ కౌన్సెంగ్
ABN , First Publish Date - 2021-01-23T05:30:00+05:30 IST
యోగివేమన యూనివర్శిటీ పీజీ రెండవ విడత కౌన్సెలింగ్ ఈనెల 28, 29 తేదీల్లో నిర్వహిస్తున్నట్లు డీవోఏ డైరెక్టర్ ప్రొఫెసర్ గంగయ్య శనివారం తెలిపారు. రెండవ విడత కౌన్సెలింగ్కు మొదటి విడతలో హాజరుకాని విద్యార్థులు హాజరై కోర్సుల్లో చేరవచ్చన్నారు.
30న స్పాట్ అడ్మిషన్లు
కడప (వైవీయూ), జనవరి 23: యోగివేమన యూనివర్శిటీ పీజీ రెండవ విడత కౌన్సెలింగ్ ఈనెల 28, 29 తేదీల్లో నిర్వహిస్తున్నట్లు డీవోఏ డైరెక్టర్ ప్రొఫెసర్ గంగయ్య శనివారం తెలిపారు. రెండవ విడత కౌన్సెలింగ్కు మొదటి విడతలో హాజరుకాని విద్యార్థులు హాజరై కోర్సుల్లో చేరవచ్చన్నారు. మొదటిదశలో కౌన్సెలింగ్కు హాజరై ఏదైనా ట్రెయినింగ్కు వెళ్లాలనుకునేవారు ఆప్షన్లు పెట్టుకోవచ్చన్నారు. బయోటెక్నాలజీ, మైక్రోబయాలజీ, జనటిక్, జర్నలిజం, సైకాలజీ, పొలిటికల్సైన్స అండ్ పబ్లిక్ అడ్మినిసే్ట్రషన, నానోటెక్నాలజీ, ఎంఈడీ, బయోటెక్నాలజీ, హెల్త్సైన్స, ఎన్విరాల్మెంటల్ సైన్స, జియాలజీ, పీజీ డిప్లమో ఇన థియేటర్ ఆర్ట్స్ ఫుడ్ టెక్నాలజీ, ఎంపీఈడీ కోర్సుల్లో ఖాళీలు ఉన్నాయన్నారు. ఈనెల 30న పీజీ కోర్సుల్లో నేరుగా ప్రవేశాలు ఉంటాయని, వైవీసెట్ 2020 రాయని విద్యార్థులు కూడా స్పాట్ అడ్మినిషన్సకు రావచ్చన్నారు.