29 జిల్లాల్లో పదిలోపే Covid కేసులు
ABN , First Publish Date - 2022-03-10T16:49:05+05:30 IST
రాష్ట్రంలో కొవిడ్ కేసులు బెంగళూరులో మాత్రమే అత్యధికంగా ఉన్నాయి. బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా 181 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. వీరిలో బెంగళూరులో 122 మంది కాగా ఏడు జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు
బెంగళూరు: రాష్ట్రంలో కొవిడ్ కేసులు బెంగళూరులో మాత్రమే అత్యధికంగా ఉన్నాయి. బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా 181 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. వీరిలో బెంగళూరులో 122 మంది కాగా ఏడు జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. 22 జిల్లాల్లో పదిలోపు కేసులు కొనసాగాయి. 222 మంది కోలుకోగా ధార్వాడ, మండ్య జిల్లాల్లో ఒక్కొక్కరు మృతి చెందారు. 28 జిల్లాల్లో మృతులు నమోదు కాలేదు. 30 జిల్లాల్లో 2,937 మంది చికిత్సలు పొందుతున్నారు. వీరిలో బెంగళూరులో 2,283 మంది ఉన్నారు.