29 మంది మెడికల్ కాలేజీ విద్యార్థులకు కరోనా

ABN , First Publish Date - 2021-10-01T00:10:30+05:30 IST

29 మంది మెడికల్ కాలేజీ విద్యార్థులకు కరోనా

29 మంది మెడికల్ కాలేజీ విద్యార్థులకు కరోనా

ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలో 29 మంది మెడికల్ కాలేజీ విద్యార్థులకు కరోనా పాజిటివ్ వచ్చిందని వైద్య అధికారులు తెలిపారు. ముంబైలోని ఓ మెడికల్ కాలేజీలో చదువుతున్న 29 మంది అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు కోవిడ్-19 పాజిటివ్ వచ్చినట్లు వైద్య అధికారులు నిర్దారించారు. మెడికల్ కాలేజీ విద్యార్థులకు కోవిడ్ సోకడంతో 10 రోజులపాటు ఆన్‌లైన్‌లో అన్ని క్లాసులు జరుగుతాయని కాలేజీ యాజమాన్యం పేర్కొంది. 29 మంది విద్యార్థుల్లో 27 మంది మొదటి డోసు కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారని దేశ్‌ముఖ్ తెలిపారు. కరోనా స్వల్ప లక్షణాలు ఉన్న 16 మంది విద్యార్థులను ఆస్పత్రికి తరలించినట్లు ఆయన చెప్పారు.

Updated Date - 2021-10-01T00:10:30+05:30 IST