ఉరకలెత్తిన ఉత్సాహం

ABN , First Publish Date - 2022-08-12T05:40:27+05:30 IST

స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా గురువారం అలంపూర్‌ చౌరస్తా లో ఉండవల్లి ఎస్‌ఐ బాలరాజు ఆధ్వర్యంలో నిర్వహించిన 2కె ఫ్రీడంరన్‌ను అలంపూర్‌ ఎమ్మెల్యే అబ్రహాం ప్రారంభించారు.

ఉరకలెత్తిన ఉత్సాహం
అలంపూర్‌ చౌరస్తాలో నిర్వహించిన ఫ్రీడం రన్‌లో త్రివర్ణ పతాకాలతో పాల్గొన్న విద్యార్థినులు

- ఘనంగా కొనసాగుతున్న స్వాతంత్య్ర వజ్రోత్సవాలు

- జిల్లా వ్యాప్తంగా 2కే ఫ్రీడం రన్‌

- అధికసంఖ్యలో పాల్గొన్న యువతీ యువకులు

- హాజరైన ప్రజాప్రతినిధులు, అధికారులు

అలంపూర్‌ చౌరస్తా, ఆగస్టు 11 : స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా గురువారం అలంపూర్‌ చౌరస్తా లో ఉండవల్లి ఎస్‌ఐ బాలరాజు ఆధ్వర్యంలో నిర్వహించిన 2కె ఫ్రీడంరన్‌ను అలంపూర్‌ ఎమ్మెల్యే అబ్రహాం ప్రారంభించారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్‌ శ్రీనువాసరెడ్డి, ఎంపీటీసీ సభ్యులు రాజశేఖర్‌, సుంకన్న, తహసీ ల్దార్‌ వీరభద్రప్ప, ఎంపీడీవో అంజనేయరెడ్డి, శ్రీకాంత్‌ పాల్గొన్నారు. 


గద్వాల : మండలంలోని వీరాపురం గ్రామంలో గురు వారం రూరల్‌ పోలీసులు, ఎస్‌ఐ ఆనంద్‌ ఆధ్వర్యంలో గురువారం ఫ్రీడం టూకే రన్‌ నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎంపీపీ ప్రతాప్‌ గౌడ్‌ హాజరయ్యారు. రన్‌లో రెసిడెన్షియల్‌ పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. కార్య క్రమంలో సర్పంచు స్వప్న, ఎంపీడీవో రవీంద్ర, పంచా యతీ కార్యదర్శి బాలేశ్వరి, నాయకులు రమేష్‌ నా యుడు, వెంకట్రాములు పాల్గొన్నారు. 


ధరూరు : వజ్రోత్సవాల్లో భాగంగా ధరూరు మండల కేంద్రంలోని వైఎస్సాఆర్‌ చౌరస్తా నుంచి తోర్నాల బీసీ రోడ్డు వరకు గురువారం 2కే ఫ్రీడం రన్‌ నిర్వహించారు. ఎంపీపీ నజిమున్నీసా జెండా ఊపి రన్‌ను ప్రారంభిం చారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ వెంకటేశ్వర్లు, జడ్పీ టీసీ సభ్యురాలు పద్మ, సర్పంచ్‌ పద్మమ్మ,  ఎంపీడీవో జబ్బార్‌, సర్పంచ్‌ పద్మమ్మ, ధరూరు ఎస్‌ఐ శేఖర్‌ రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.


అలంపూరు : స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా అలంపూరులో 2కె ఫ్రీడమ్‌రన్‌ నిర్వహించారు. అంతకు ముందు జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయాల వద్ద జూనియర్‌ సివిల్‌ జడ్జి కవిత జెండా ఊపి రన్‌ను ప్రారంభించారు. రన్‌లో ఎస్‌ఐ శ్రీహరి, మునిసిపల్‌ కమి షనర్‌ నిత్యానంద్‌, ఎంపీడీవో సూరి, ఈవో పురేందర్‌ కుమార్‌ పాల్గొన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్‌ ఇంతి యాజ్‌, రెవెన్యూ అధికారి గురురాజ, పంచాయతీ కార్యదర్శులు, జూనియర్‌ అసిస్టెంట్‌ షరీఫ్‌, నారాయణ, పోలీసులు సుంకన్‌బాబు, ఆలయ అర్చకులు ధనుం జయశర్మ, సిబ్బంది పాల్గొన్నారు.


కేటీదొడ్డి : మండల కేంద్రంలో రెవెన్యూ, పోలీస్‌ అధికారులు 2కే ఫ్రీడం రన్‌ను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యుడు రాజశేఖర్‌, వైస్‌ ఎంపీ పీ రామకృష్ణనాయుడు, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు ఉరుకుందు, తహసీల్దార్‌ సుందర్‌రాజు, ఎంపీడీవో సయ్యద్‌ఖాన్‌, ఆర్‌ఐ నాగేష్‌, ఏఎస్‌ఐ జిక్కిబాబు, హెడ్‌ కానిస్టేబుల్‌ రఘునాథం పాల్గొన్నారు.  


మల్దకల్‌ : మండల కేంద్రంలో గురువారం ఫీడం రన్‌ నిర్వహించారు. పెట్రోల్‌ బంక్‌ చౌరస్తా వద్ద ఎంపీపీ రాజారెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్‌ తిమ్మారెడ్డి, వైస్‌ ఎంపీపీ పెద్దవీరన్న, తహసీల్దార్‌ హరికృష్ణ, ఎస్‌ఐ శేఖర్‌లు రన్‌ను ప్రారంభించారు. కార్యక్రమంలో సర్పంచు యాకో బు, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు వెంకటన్న, విక్రమ సింహారెడ్డి, నాయకులు నరసింహారెడ్డి, ఆంజనేయులు, అజయ్‌, హబూబ్‌అలీ పాల్గొన్నారు.


ఇటిక్యాల : వజ్రోత్సవాల్లో భాగంగా ఇటిక్యాలలో 2కే ఫ్రీడం రన్‌ నిర్వహించారు. అలంపూర్‌ సీఐ సూర్య నాయక్‌, ఎంపీపీ స్నేహ, ఎంపీడీవో రాఘవ, తహసీల్దార్‌ సుబ్రహ్మణ్యం, ఎస్‌ఐలు వెంకటస్వామి, గోకారి త్రివర్ణ పతాకాలను చేతపట్టుకుని జాతీయ గీతాన్ని ఆలపిస్తూ రన్‌లో పాల్గొన్నారు. కార్యక్రమంలో గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్‌ తిరుపతయ్య, వ్యాయామ ఉపాధ్యాయులు నరసింహ, రాజు, రాధాదేవి, సరస్వతి పాల్గొన్నారు. 


మానవపాడు : వజ్రోత్సవాల్లో భాగంగా మానవ పాడులో 2కే ఫ్రీడంరన్‌ నిర్వహించారు. ఎంపీడీవో రమణరావు, తహసీల్దార్‌ నరేష్‌, ఎస్‌ఐ సంతోష్‌తో పాటు ప్రజాప్రతినిధులు రన్‌లో పాల్గొన్నారు. 


వడ్డేపల్లి :  శాంతినగర్‌ పట్టణంలో నిర్వహించిన ఫ్రీడంరన్‌ను ఎస్‌ఐ శ్రీనివాస్‌ జెండా ఊపి ప్రారంభిం చారు. మునిసిపల్‌ వైస్‌ చైర్‌పర్సన్‌ ముఖ్యఅతిథిగా హాజ రయ్యారు. కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్‌, ఎంపీ డీవో, ఫిజికల్‌ డైరెక్టర్లు, పోలీసులు పాల్గొన్నారు. 


రాజోలి : రాజోలిలో ఎస్‌ఐ లెనిన్‌ ఆధ్వర్యంలో 2కె ఫ్రీడం రన్‌ నిర్వహించారు. కార్యక్రమానికి ఎంపీడీవో గోవిందురావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. సర్పంచ్‌ వెంకటేశ్వరమ్మ, జడ్పీటీసీ సభ్యురాలు సుగుణమ్మ, తహ సీల్దార్‌ శ్రీనివాస్‌ శర్మ, హుసేన్‌, మూగన్న పాల్గొన్నారు.


ఎర్రవల్లి చౌరస్తా : ఇటిక్యాల మండల కేంద్రంలో నిర్వహించిన ఫ్రీడంరన్‌ను తహసీల్దార్‌ సుబ్రహ్మణ్యం ప్రారంభించారు. బెటాలియన్‌లో ఫ్రీడంరన్‌ను నిర్వహిం చారు. కార్యక్రమంలో ఎంపీపీ స్నేహ, ఎస్‌ఐలు గోకారి, వెంకటస్వామి, ఎంపీవో భాస్కర్‌, అర్‌ఐ ప్రశాంత్‌గౌడుపాల్గొన్నారు. 


అయిజ : పట్టణంలో నిర్వహించిన 2కె ఫ్రీడంరన్‌ను అలంపూర్‌ ఎమ్మెల్యే అబ్రహాం ముఖ్యఅతిథిగా హాజర య్యారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ పటేల్‌ విష్ణువర్దన్‌రెడ్డి, సింగిల్‌విండో అధ్యక్షుడు పోతుల మధుసూదన్‌రెడ్డి, చైర్మన్‌ దేవన్న, కమిషనర్‌ నర్సయ్య, తహసీల్దార్‌ యాదగిరి, ఎంపీడీవో సాయిప్రకాష్‌, సింగిల్‌విండో మాజీ అధ్యక్షుడు రాముడు పాల్గొన్నారు. 





Updated Date - 2022-08-12T05:40:27+05:30 IST