అమెరికాలో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి!

ABN , First Publish Date - 2021-03-12T21:12:09+05:30 IST

అగ్రరాజ్యం అమెరికాలో కాల్పులు కలకలం సృష్టించాయి. గుర్తు తెలియని దుండగులు జరిపిన దాడిలో ముగ్గురు చనిపోగా, ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే.. టెక్సాస్‌లోని హ్యూస్టన్‌ నగరంలో ఉ

అమెరికాలో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి!

టెక్సాస్: అగ్రరాజ్యం అమెరికాలో కాల్పులు కలకలం సృష్టించాయి. గుర్తు తెలియని దుండగులు జరిపిన దాడిలో ముగ్గురు చనిపోగా, ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే.. టెక్సాస్‌లోని హ్యూస్టన్‌ నగరంలో ఉన్న ఓ అపార్ట్‌మెంట్ పార్కింగ్ లాట్‌లో బుధవారం రాత్రి 11 గంటల సమయంలో గుర్తు తెలియని దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఈ దాడిలో ఇద్దరు 40ఏళ్ల వ్యక్తి సహా 18ఏళ్ల ఇద్దరు టీనేజర్లు ప్రాణాలు కోల్పోయారు. యువతి తీవ్రంగా గాయపడంది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని తీవ్రంగా గాయపడిన యువతిని ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ.. రెండు గ్రూప్‌ల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడి.. కాల్పులకు తీసినట్టు భావిస్తున్నట్టు పేర్కొన్నారు. ఐదుగురు బృందంగా ఉన్న గ్రూపు సభ్యులపై ఇద్దరు వ్యక్తులు దాడి చేసినట్టు పారిపోయినట్టు భావిస్తున్నన్నామని వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్టు తెలిపిన పోలీసులు.. దాడికి పాల్పడిన వారి కోసం గాలింపు చర్యలు ప్రారంభించామని చెప్పారు. 


Updated Date - 2021-03-12T21:12:09+05:30 IST