New York లో దారుణం.. ఓ NRI కుటుంబంలో విషాదం.. అగ్నిప్రమాదంలో ముగ్గురు మృతి..!
ABN , First Publish Date - 2022-06-22T00:41:55+05:30 IST
న్యూయార్క్(New york) నగరంలో శుక్రవారం జరిగిన ఓ అగ్ని ప్రమాదంలో భారతీయ కుటుంబం అసువులు బాసింది.
ఎన్నారై డెస్క్: న్యూయార్క్(New york) నగరంలో శుక్రవారం జరిగిన ఓ అగ్ని ప్రమాదంలో భారతీయ కుటుంబం అసువులు బాసింది. స్థానిక మీడియా కథనాల ప్రకారం.. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకునే సరికే మంటలు ఆ ఇల్లంతా వ్యాపించాయి. మంటలను ఆర్పిన తరువాత సిబ్బంది.. ఇంటి సెల్లార్లోని రెండు మృతదేహాలను గుర్తించారు. మరుసటి రోజు మూడో మృతదేహం వారికి లభించింది. ఈ ప్రమాదంలో నంద బాలో పర్సోద్ , బోనో సాలిమా దంపతులతో పాటూ వారి కుమారుడు(22) దేవోన్ పర్సోద్ కూడా ప్రాణాలు పోగొట్టుకున్నారు.
స్థానిక పోలీసులు ఈ ప్రమాదాన్ని ఫై అలార్మ్ ఫైర్గా వర్గీకరించారు. ప్రమాద సమయంలో గాలుల కారణంగా మంటలు మరో నాలుగు ఇళ్లకు కూడా వ్యాపించాయన్నారు. ఇక నంద పర్సోద్ ఓ మెడికల్ కంపెనీలో పనిచేయగా.. ఆయన భార్య జేఎఫ్కే ఎయిర్పోర్టులో ఉద్యోగం చేసేవారు. వారి కుటుంబం క్వీన్స్ బరో ప్రాంతంలో ఉండేదని బోనో సాలిమా సోదరుడు అబీద్ అలీ మీడియాకు తెలిపారు. గయానా నుంచి వలసొచ్చిన భారతీయ సంతతి వారు ఆ ప్రాంతంలో అధికంగా ఉంటారు. కాగా.. బాధిత కుటుంబాన్ని ఆదుకునేందుకు అనేక మంది ఆన్లైన్లో విరాళాలు ఇస్తున్నారు.