ఊరంతా ఏనుగును తరుముతుంటే.. సెల్ఫీకి ట్రై చేసిన యువకులు.. చివరకు

ABN , First Publish Date - 2021-03-01T11:03:15+05:30 IST

జంతువులతో ఫొటోలు గట్రా దిగేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ మాత్రం అజాగ్రత్త చూపించినా క్షణాల్లోనే ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. ఛత్తీస్‌గఢ్‌లో తాజాగా జరిగిన ఘటనే దీనికి ఉదాహరణ. ఇక్కడ ఓ గ్రామం వద్ద ఓ ఏనుగు కనిపించింది

ఊరంతా ఏనుగును తరుముతుంటే.. సెల్ఫీకి ట్రై చేసిన యువకులు.. చివరకు

ఛత్తీస్‌గఢ్: జంతువులతో ఫొటోలు గట్రా దిగేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ మాత్రం అజాగ్రత్త చూపించినా క్షణాల్లోనే ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. ఛత్తీస్‌గఢ్‌లో తాజాగా జరిగిన ఘటనే దీనికి ఉదాహరణ. ఇక్కడ ఓ గ్రామం వద్ద ఓ ఏనుగు కనిపించింది. దాన్ని తరిమేయడానికి గ్రామస్థులు ప్రయత్నించారు. ఆ సమయంలో ముగ్గురు మిత్రులు సదరు ఏనుగుతో సెల్ఫీ తీసుకోవాలని అనుకున్నారు. అయితే అలా చేయడమే వారి ప్రాణాల మీదకు తీసుకొచ్చింది. అంతమంది గ్రామస్తులు వచ్చినందుకు బెదిరిందో ఏమోగానీ.. ఆ జీవి ఈ ముగ్గురు స్నేహితులపైకి దూసుకొచ్చింది. ఈ క్రమంలో ఓ వ్యక్తిని తొక్కేసింది. అతను అక్కడికక్కడే మృతిచెందాడు.

Updated Date - 2021-03-01T11:03:15+05:30 IST