మరో ముగ్గురికి కరోనా నెగిటివ్.. ఇంగ్లండ్ బయల్దేరిన పాక్ క్రికెటర్లు

ABN , First Publish Date - 2020-07-07T03:13:29+05:30 IST

ఇటీవల కరోనా పాజిటివ్‌గా తేలిన పాకిస్తాన్ క్రికెటర్లలో ముగ్గురు కోలుకున్నారు.

మరో ముగ్గురికి కరోనా నెగిటివ్.. ఇంగ్లండ్ బయల్దేరిన పాక్ క్రికెటర్లు

ఇస్లామాబాద్: ఇటీవల కరోనా పాజిటివ్‌గా తేలిన పాకిస్తాన్ క్రికెటర్లలో ముగ్గురు కోలుకున్నారు. వీరికి తాజాగా చేసిన పరీక్షల్లో నెగిటివ్ ఫలితాలొచ్చినట్లు సమాచారం. దీంతో హైదర్ అలీ, ఇమ్రాన్ ఖాన్, కాషిఫ్ భట్టి ఇంగ్లండ్ బయలురేరారు. గత నెలలో కరోనా పాజిటివ్‌గా తేలిన 10మంది ఆటగాళ్లలో ఇప్పటికే ఆరుగురు ఇంగ్లండ్ వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ పదిమంది ఆటగాళ్లకు కరోనా పాజిటివ్ అని తేలడం ప్రపంచ క్రికెట్‌లో కలకలం సృష్టించింది.

Updated Date - 2020-07-07T03:13:29+05:30 IST