ఆ 3 టేబుళ్లే ఎందుకు టార్గెట్ అయ్యాయి..?

ABN , First Publish Date - 2022-04-05T17:47:03+05:30 IST

పుడ్డింగ్ అండ్ మింక్ పబ్‌లో ముఖ్యంగా మూడు టేబుళ్లను పోలీసులు టార్గెట్ చేస్తున్నారు.

ఆ 3 టేబుళ్లే ఎందుకు టార్గెట్ అయ్యాయి..?

హైదరాబాద్ : పుడ్డింగ్ అండ్ మింక్ పబ్‌లో ముఖ్యంగా మూడు టేబుళ్లను పోలీసులు టార్గెట్ చేస్తున్నారు. ఎందుకంటే ఆ మూడు టేబుళ్లపై బర్త్ డే పార్టీ జరిగిందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆ మూడు టేబుళ్ల మీద పార్టీ చేసుకున్న వారి వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. ఇప్పటికే సీసీ కెమెరాల దృశ్యాలను సేకరించారు. ఇరుకు గదిలో‌ చీకటి ఉండటంతో...‌ సీసీ కెమెరాల దృశ్యాల గుర్తింపు పోలీసులకు కష్టంగా మారింది. అసలు వారంతా తీసుకున్న డ్రింక్‌లో ఏం కలిసిందనే దానిపై సైతం ఆరా తీస్తున్నారు. ‌పబ్ మేనేజర్ గోవా ట్రిప్పులపై పోలీసులు ఆరా తీస్తున్నారు. మైనర్లను‌ పబ్బులోకి అనుమతించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితులు అభిషేక్, అనిల్‌లను కస్టడీకి తీసుకుని విచారిస్తే మరిన్ని వివరాలు తెలుస్తాయని పోలీసులు చెబుతున్నారు.


అభిషేక్ చుట్టూ బిగుసుకుంటున్న ఉచ్చు..

కాగా.. ఈ డ్రగ్స్ కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. పుడింగ్ ఇన్ మింగ్ పబ్ డ్రగ్స్ కేసులో ఏ2 గా ఉన్న అభిషేక్ ఉప్పల పలువురు సెలెబ్రిటీలతో ఫోటోలు.. పలువురు సినీ తారలతో కాంటాక్ట్స్.. ప్రముఖ హీరోలు సినీ సెలబ్రిటీస్‌తో సత్సంబంధాలు వెలుగులోకి వచ్చాయి. అభిషేక్ ఫోన్ కాల్ డేటా కీలకంగా మారింది. అభిషేక్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. హై ప్రొఫైల్ ఉన్న వ్యక్తులతో అభిషేక్‌కు దగ్గర పరిచయాలున్నాయి. ఈ కేసులో అభిషేక్ ఉప్పల కాల్ డేటా, వాట్సాప్ ఛాటింగ్ కీలకంగా మారింది.

Updated Date - 2022-04-05T17:47:03+05:30 IST