Jammu And Kashmir: కశ్మీర్ పండిట్‌ను హత్య చేసిన ఉగ్రవాదులను మట్టుబెట్టిన సైన్యం

ABN , First Publish Date - 2022-05-14T01:09:05+05:30 IST

జమ్మూకశ్మీర్‌‌లోని బండీపొర జిల్లా బ్రార్ అరాగమ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు.

Jammu And Kashmir: కశ్మీర్ పండిట్‌ను హత్య చేసిన ఉగ్రవాదులను మట్టుబెట్టిన సైన్యం

బాండిపొర: జమ్మూకశ్మీర్‌‌లోని బండీపొర జిల్లా బ్రార్ అరాగామ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. వీరిలో ఇద్దరు కశ్మీరీ పండిట్ రాహుల్ భట్‌ (Rahul Bhat)పై గురువారం జరిగిన దాడిలో పాల్గొన్నవారే కావడం గమనార్హం. బుధవారం కూడా ఓ ఉగ్రవాది హతమయ్యాడు. ఇదే జిల్లాలోని సలిందర్ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఉగ్రవాది మృతి చెందాడు. మరో ఇద్దరు తప్పించుకుని పారిపోయారు. 


ఆ రోజు పారిపోయిన వారే నేటి ఎన్‌కౌంట్‌లో హతమైనట్టు కశ్మీర్ ఐజీ తెలిపారు. పాక్ ప్రేరేపిత లష్కరే తోయిబా ఉగ్రవాదులైన వీరిద్దరూ ఈ నెల 11న జరిగిన ఎన్‌కౌంటర్ నుంచి వీరిద్దరూ తప్పించుకున్నట్టు చెప్పారు. కశ్మీరీ పండిట్‌ను హత్య చేసింది తామేనని ఉగ్రవాద సంస్థ ‘కశ్మీర్ టైగర్స్’ ప్రకటించింది.  

Read more