30 కుటుంబాలు టీడీపీలో చేరిక
ABN , First Publish Date - 2021-03-06T05:02:01+05:30 IST
పురపాలక పరిధి 30 వార్డుకు చెంది న 30 కుటుంబా లు టీడీపీ నాయకులు జి.సీతారామిరెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం టీడీపీ లో చేరారు.
ప్రొద్దుటూరు క్రైం, మార్చి 5 : పురపాలక పరిధి 30 వార్డుకు చెంది న 30 కుటుంబా లు టీడీపీ నాయకులు జి.సీతారామిరెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం టీడీపీ లో చేరారు. టీడీపీ కడప పార్లమెంట్ అ ధ్యక్షుడు మల్లెల లింగారెడ్డి సమక్షంలో టీడీపీలో చేరారు.
పార్టీలో చేరిన వారిలో వైసీపీకి చెందిన బోగాల మునీశ్వర్రెడ్డి, గురుజా రామసుబ్బారెడ్డి, బోగాల మునిరెడ్డి, పాతకోట గోపాల్రెడ్డి, మార్తల మహేశ్వర్రెడ్డి సహా 30 కుటుంబాలు టీడీపీలో చేరినట్లు లింగారెడ్డి తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలు పు కోసం కృషి చేయాలని పార్టీ తీర్ధం పుచ్చుకున్న వారిని లింగారెడ్డి కోరారు.