రూ.30 కోట్ల స్థలంలో పోలీస్‌ స్టేషనా..?

ABN , First Publish Date - 2022-10-02T05:27:31+05:30 IST

రూ.30 కోట్ల విలువైన మున్సిపల్‌ స్థలాన్ని రక్షించుకునేందుకు ఎంతవరకైనా వెళతానని మున్సిపల్‌ చైర్మన జేసీ ప్రభాకర్‌రెడ్డి అన్నారు.

రూ.30 కోట్ల స్థలంలో పోలీస్‌ స్టేషనా..?

పీర్లచావిడి తొలగించొద్దన్నందుకు వాగ్వాదం..

వైసీపీ మండల కన్వీనర్‌, అనుచరుల వీరంగం

తాడిపత్రి, అక్టోబరు 1: రూ.30 కోట్ల విలువైన మున్సిపల్‌ స్థలాన్ని రక్షించుకునేందుకు ఎంతవరకైనా వెళతానని మున్సిపల్‌ చైర్మన జేసీ ప్రభాకర్‌రెడ్డి అన్నారు. ఆ స్థలంలో ట్రాఫిక్‌ పోలీ్‌సస్టేషనను నిర్మించేందుకు ఎమ్మెల్యే పెద్దారెడ్డి, డీఎస్పీ చైతన్య ప్రయత్నించడం సరికాదని అన్నారు. నల్లదుస్తులు ధరించి శనివారం ఆ స్థలం వద్ద నిరసన తెలిపారు. ‘తాడిపత్రి ప్రజల్లారా మేల్కొం డి. ఎమ్మెల్యే, డీఎస్పీ ఊరిని మోసం చేస్తున్నారు. రూ.కోట్ల విలువైన మున్సిపల్‌ స్థలాన్ని ప్రభుత్వానికి ధారాదత్తం చేయాలని చూస్తున్నారు’ అని రాసిన ఫ్లెక్సీని ప్రదర్శించారు. ఆర్థిక లోటులో ఉన్న మున్సిపాలిటీ.. స్వయం సమృద్ధి సాధించేలా ఆ స్థలంలో మున్సిపల్‌ కాంప్లెక్స్‌ నిర్మించాలని కౌన్సిల్‌ తీర్మానం కూడా చేశామని అన్నారు. నిధుల సేకరణకు ప్రయత్నిస్తుండగా, ఎమ్మెల్యే, డీఎస్పీ అత్యుత్సాహంతో ట్రాఫిక్‌ పోలీ్‌సస్టేషన నిర్మించేందుకు ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. పోలీ్‌సస్టేషన నిర్మాణానికి మూడు స్థలాలు చూపించామని, వాటిని కాదని, రూ.కోట్ల విలువైన స్థలాన్ని ఎంచుకోవడం ఏమిటని ప్రశ్నించారు. ఈ స్థలం కోసం తాము హైకోర్టుకు వెళుతున్నామని అన్నారు. ఈ నెల 5 నుంచి కౌన్సిలర్లతో కలిసి నిరసన కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. మున్సిపల్‌ కమిషనర్‌ను భయపెట్టి, తప్పుడు డిక్లరేషనను సృష్టించారని ఆరోపించారు. ఆ డిక్లరేషన కారణంగా ఆయన ఇంటికి పోవడం ఖాయమని అన్నారు. టౌన పోలీ్‌సస్టేషన వెనుక ఉన్న మున్సిపల్‌ భవనం, పాతకోటలో ఉన్న భవనం, అభయాంజనేయస్వామి విగ్రహం వెనుక మున్సిపల్‌ ఖాళీ స్థలాన్ని చూపించామని అన్నారు. వాటిని కాదని, అత్యంత విలువైన స్థలంలో మాత్రమే ట్రాఫిక్‌ పోలీ్‌సస్టేషన కడతామని మొం డిపట్టు పట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.




Updated Date - 2022-10-02T05:27:31+05:30 IST