షిప్యార్డులో 300 జాతీయ జెండాలను ఎగరవేస్తాం
ABN , First Publish Date - 2022-08-09T06:02:25+05:30 IST
హిందుస్థాన్ షిప్యార్డులో హర్ ఘర్ తిరంగ కార్యక్రమాన్ని సంస్థ సీఎండీ హేమంత్ ఖత్రీ సోమవారం ప్రారంభించారు.
సంస్థ సీఎండీ హేమంత్ ఖత్రీ
మల్కాపురం, ఆగస్టు 8: హిందుస్థాన్ షిప్యార్డులో హర్ ఘర్ తిరంగ కార్యక్రమాన్ని సంస్థ సీఎండీ హేమంత్ ఖత్రీ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అవుతున్న సందర్భంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లా భాగంగా జాతీయ జెండా ప్రతీ ఇంటిపై ఎగిరేలా చర్యలు చేపట్టడం ఆనందదాయకమన్నారు. ఇందులో భాగంగా షిప్యార్డులో 300 జాతీయ జెండాలను ఎగరవేసే యోచనలో ఉన్నామన్నారు. అలాగే ఈ నెల 13 నుంచి 15, 22వ తేదీల్లో ప్రజలకు షిప్యార్డు సందర్శనకు అవకాశం కల్పిస్తామని పేర్కొన్నారు.