31 వరకు ర్యాలీలు, రోడ్షోలపై నిషేధం
ABN , First Publish Date - 2022-01-23T07:39:40+05:30 IST
దేశంలో కొన్ని ప్రాంతా ల్లో కరోనా వైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో ఎన్నికల ర్యాలీలు, రోడ్షోలు, బైక్ర్యాలీలు, పాదయాత్రలపై నిషేధాన్ని ఎన్నికల సంఘం(ఈసీ) ఈ నెల 31 వరకు పొడిగించింది. ఉత్తరప్రదేశ్,..
న్యూఢిల్లీ, జనవరి 22: దేశంలో కొన్ని ప్రాంతా ల్లో కరోనా వైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో ఎన్నికల ర్యాలీలు, రోడ్షోలు, బైక్ర్యాలీలు, పాదయాత్రలపై నిషేధాన్ని ఎన్నికల సంఘం(ఈసీ) ఈ నెల 31 వరకు పొడిగించింది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, పంజాబ్, మణిపూర్ శాసనసభలకు ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. కరోనా వైర స్ కేసులకు సంబంధించి కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి, ఎన్నికలు జరిగే 5 రాష్ట్రాల ఆరోగ్యశాఖ కార్యదర్శులతో సమీక్షించిన తరువాత ఈసీ ఈ నిర్ణ యం తీసుకుంది.అయితే, ఫిబ్రవరి 10న ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో ఈ నెల 28 నుంచి, 14న ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో ఫిబ్రవరి 1 నుంచి రాజకీయ పార్టీలకు, పోటీ చేసే అభ్యర్థులకు మినహాయింపు ఇచ్చింది. ఇంటింటి ప్రచారంలో పాల్గొనేవారి సంఖ్యను 5 నుంచి 10(సెక్యూరిటీ సిబ్బంది కాకుండా)కి పెంచింది.