ఎస్సీ గురుకులాల్లో 317జీవో బదిలీలు

ABN , First Publish Date - 2022-07-06T05:14:38+05:30 IST

ఎస్సీ గురుకులాల్లోని ఉపాధ్యాయులు, లెక్చరర్లు, సిబ్బంది బదిలీలు 317 జీవో మేరకు జరగనున్నాయి.

ఎస్సీ గురుకులాల్లో 317జీవో బదిలీలు

ఖమ్మంసంక్షేమవిభాగం, జూలై5: ఎస్సీ గురుకులాల్లోని ఉపాధ్యాయులు, లెక్చరర్లు, సిబ్బంది బదిలీలు 317 జీవో మేరకు జరగనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర అధికారుల నుంచి ఖమ్మం ఆర్సీవో కార్యాలయానికి 317 జీవో ఉద్యోగ బదిలీల మార్గదర్శకాలు అందాయి. దీంతో ఖమ్మం ఆర్సీవో కార్యాలయంలో ఉద్యోగ బదిలీల షెడ్యూల్‌ను ఖరారు చేశారు. ఈనెల 7వరకు గురుకులాల ఉపాధ్యాయులు, లెక్సరర్లు, సిబ్బంది ఆయా గురుకులాల ప్రిన్స్‌పాల్స్‌కు అందచేయాల్సి ఉంటుంది. ప్రిన్స్‌పాల్స్‌ నుంచి ఈనెల 8వరకు ఆర్సీవో కార్యాలయంలో ఉద్యోగ బదిలీల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ మేరకు ఖమ్మం ఆర్సీవో కార్యాలయం పరిధిలోని ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్‌ జిల్లాల అధికారులు సమాచారం అందించారు.

Updated Date - 2022-07-06T05:14:38+05:30 IST