ఉమ్మడి మెదక్ జిల్లాలో 32 కరోనా కేసులు
ABN , First Publish Date - 2021-07-26T03:40:55+05:30 IST
సిద్దిపేట జిల్లాలో ఆదివారం 24 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జిల్లాలో మొత్తం 3,095 మందికి ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షలు నిర్వహించగా 24 మందికి కరోనా సోకినట్టు వెల్లడైందని వైద్యాధికారులు తెలిపారు. మెదక్ జిల్లావ్యాప్తంగా 283 మందికి ర్యాపిడ్ పరీక్షలు నిర్వహించగా ముగ్గురికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయ్యింది. సంగారెడ్డి జిల్లాలో జిల్లాలో ఆదివారం ఐదుగురికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయ్యింది.
సిద్దిపేట/మెదక్ అర్బన్/సంగారెడ్డి అర్బన్/ జూలై 25: సిద్దిపేట జిల్లాలో ఆదివారం 24 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జిల్లాలో మొత్తం 3,095 మందికి ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షలు నిర్వహించగా 24 మందికి కరోనా సోకినట్టు వెల్లడైందని వైద్యాధికారులు తెలిపారు. మెదక్ జిల్లావ్యాప్తంగా 283 మందికి ర్యాపిడ్ పరీక్షలు నిర్వహించగా ముగ్గురికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయ్యింది. సంగారెడ్డి జిల్లాలో జిల్లాలో ఆదివారం ఐదుగురికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయ్యింది. జిల్లాలో మొత్తం 866 మందికి ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టులు చేశారు. ఆర్టీపీసీఆర్ పరీక్షల నిమిత్తం 140 మంది నుంచి శాంపిళ్లు సేకరించి గాంధీ ఆస్పత్రికి పంపినట్టు వైద్యాధికారులు తెలిపారు.