టెక్నికల్ పోస్టులకు 339 మంది హాజరు
ABN , First Publish Date - 2021-04-24T04:49:42+05:30 IST
జిల్లాలో బి.కేటగిరీకి సంబంధించి కంప్యూటర్ ఆపరేటర్ హోంగార్డు (టెక్నికల్) పోస్టులకు 339 మంది శుక్రవారం హాజరైనట్లు ఎస్పీ అన్బురాజన్ తెలిపారు.
కడప(క్రైం), ఏప్రిల్ 23: జిల్లాలో బి.కేటగిరీకి సంబంధించి కంప్యూటర్ ఆపరేటర్ హోంగార్డు (టెక్నికల్) పోస్టులకు 339 మంది శుక్రవారం హాజరైనట్లు ఎస్పీ అన్బురాజన్ తెలిపారు. దళారుల మాటలు నమ్మి ఎవరూ మోసపోవద్దని, ప్రతిభ ఆధారంగా ఎంపికలుంటాయన్నారు. అభ్యర్థులు వారికి కేటాయించిన తేదీల్లోనే అనుమతించబడుతుందన్నారు. ఎంపిక ప్రక్రియలో హోంగార్డ్సు సెలక్షన్ కమిటీ సభ్యులైన హోంగార్డ్స్ కమాండెంట్ (వైజాగ్ రీజియన్) చంద్రమౌళి, చిత్తూరు అదనపు ఎస్పీ (పరిపాలన) మహేష్ పాల్గొన్నారు.