34 MMTS రైళ్లు రద్దు..
ABN , First Publish Date - 2022-05-29T14:59:20+05:30 IST
భాగ్యనగరంలో ఆదివారం 34 ఎంఎంటీఎస్ రైళ్లు రద్దయ్యాయి. ఆయా రూట్లలో..
- ఆ రూట్లలో ఆర్టీసీ అదనపు బస్సులు
హైదరాబాద్ సిటీ : భాగ్యనగరంలో ఆదివారం 34 ఎంఎంటీఎస్ రైళ్లు రద్దయ్యాయి. ఆయా రూట్లలో ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ఆర్టీసీ అదనపు బస్సులను నడుపుతుందని గ్రేటర్ ఆర్టీసీ ఈడీ యాదగిరి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. లింగంపల్లి - హైదరాబాద్ (9 సర్వీసులు), ఫలక్నుమా- లింగంపల్లి (7 సర్వీసులు), సికింద్రాబాద్ - లింగంపల్లి (1 సర్వీస్) ఎంఎంటీఎస్ రైల్ సర్వీసులు రద్దు చేశారు. దీంతో 9వైఎఫ్ రూట్లో కేశవగిరి - బోరబండకు 22 బస్సులు, 10హెచ్ (సికింద్రాబాద్-హైటెక్సిటీ) 54 బస్సులు, 10వైఎఫ్ (సికింద్రాబాద్-బోరబండ) 16 బస్సులు, 218 (సీబీఎస్, చాంద్రాయణగుట్ట-పటాన్చెరు) 108 బస్సులు, 219 (సికింద్రాబాద్ - పటాన్చెరు) రూట్లో 84 బస్సులను ఆర్టీసీ నడుపుతుందన్నారు.