జూడో జట్లకు 34మంది ఎంపిక
ABN , First Publish Date - 2021-10-27T06:41:03+05:30 IST
తిరుపతిలోని శ్రీనివాస క్రీడాసముదాయంలో మూడురోజులుగా రాష్ట్రస్థాయి జూడో జట్టు ఎంపిక కోసం సబ్జూనియర్, క్యాడెట్ జూడో పోటీలు నిర్వహించారు.
తిరుపతి(కొర్లగుంట), అక్టోబరు 26: తిరుపతిలోని శ్రీనివాస క్రీడాసముదాయంలో మూడురోజులుగా రాష్ట్రస్థాయి జూడో జట్టు ఎంపిక కోసం సబ్జూనియర్, క్యాడెట్ జూడో పోటీలు నిర్వహించారు. జిల్లా తరపున 34మంది క్రీడాకారులు ఎంపికయ్యారు. వీరు గురువారం నుంచి అనంతపురంలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారు. ఎంపికైన క్రీడాకారులకు మెడిగో ఆస్పత్రి ఆధ్వర్యంలో జెర్సీని వితరణ చేసి, వైద్యపరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాలర్స్ గ్రూప్ చైర్మన్ దివాకర్రెడ్డి, కార్పొరేటర్ వెంకటేశ్, మెడిగో ఆస్పత్రి డాక్టర్ మేడిపల్లి సజిత్, శ్రీనివాస స్పోర్ట్స్ క్లబ్ ఏవో జయరామయ్య తదితరులు పాల్గొన్నారు.