భద్రాద్రి జిల్లాలో తొలిరోజు 3,420 కొత్త కార్డుల పంపిణీ

ABN , First Publish Date - 2021-07-27T04:37:35+05:30 IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గత మూడేళ్లుగా రేషనకార్డు కోసం ఎదురు చూసిన లబ్ధిదారుల నిరీక్షణ ఫలించింది. ప్రభుత్వం జిల్లాకు 12,574 కొత్త రేషనకార్డులు మంజూరు

భద్రాద్రి జిల్లాలో తొలిరోజు 3,420 కొత్త కార్డుల పంపిణీ
కొత్తగూడెంలో ఆహార బద్రతాకార్డులను పంపిణీ చేస్తున్న ఎమ్మేల్యే వనమా వెంకటేశ్వరరావు.

మొత్తం 12,574 ఆహారభద్రతా కార్డుల మంజూరు 

 కొత్తగూడెం కలెక్టరేట్‌ జులై 26: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గత మూడేళ్లుగా రేషనకార్డు కోసం ఎదురు చూసిన లబ్ధిదారుల నిరీక్షణ ఫలించింది. ప్రభుత్వం జిల్లాకు 12,574 కొత్త రేషనకార్డులు మంజూరు చేయగా సోమవారం పంపిణీ ప్రారంభించారు. తొలిరోజు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో 3,420రేషన కార్డులను ప్రజాప్రతినిధులు పంపిణీ చేశారు. కొత్తగూడెంలో కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, కలెక్టర్‌ అనుదీప్‌ కార్డులను పంపిణీ చేశారు.   అశ్వాపురంలో ఎమ్మెల్యే రేగా కాంతారావు, భద్రాచలం నియోజకవర్గంలో ఎమ్మెల్యే పొదెం వీరయ్య, అశ్వారావుపేటలో ఎమ్మెల్యే మెచ్చానాగేశ్వరరావు ఇల్లెందు నియోజకవర్గంలో ఎమ్మెల్యే హరిప్రియ, అదనపు కలెక్టర్‌ కె. వెంకటేశ్వర్లు కొత్తకార్డులను పంపిణీ చేశారు. వైరా నియోజకవర్గంలోని జూలూరుపావు మండంలో మొత్తం 419 రేషనకార్డులు మంజూరు కాగా 385రేషన కార్డులను పంపిణీ చేశారు. 

Updated Date - 2021-07-27T04:37:35+05:30 IST