జిల్లాకు 35 శీతల గిడ్డంగులు
ABN , First Publish Date - 2022-01-21T05:07:02+05:30 IST
వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధులు (అగ్రి ఇన్ఫ్రాస్టక్చర్ ఫస్ట్) పథకం ద్వారా జిల్లాకు 102 ఉత్పత్తి సేకరణ కేంద్రాలతో పాటు 35 శీతల గిడ్డంగులు మంజూరయ్యాయని ఉద్యాన శాఖ ఉప సంచాలకులు ఎల్.వజ్రశ్రీ గురువారం తెలిపారు. వీటిని 75 శాతం రాయితీతో ఆసక్తి కలిగిన రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు ఇస్తారన్నారు.
102 ఉత్పత్తి సేకరణ కేంద్రాలు మంజూరు
కడప(రూరల్), జనవరి 20: వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధులు (అగ్రి ఇన్ఫ్రాస్టక్చర్ ఫస్ట్) పథకం ద్వారా జిల్లాకు 102 ఉత్పత్తి సేకరణ కేంద్రాలతో పాటు 35 శీతల గిడ్డంగులు మంజూరయ్యాయని ఉద్యాన శాఖ ఉప సంచాలకులు ఎల్.వజ్రశ్రీ గురువారం తెలిపారు. వీటిని 75 శాతం రాయితీతో ఆసక్తి కలిగిన రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు ఇస్తారన్నారు. వీటిని జిల్లాలో ఉన్న అన్ని రైతు ఉత్పత్తి దారుల సంఘాలు మామిడి, అరటి, బొప్పాయి, బత్తాయి, టమోట, నిమ్మ రైతులు, రైతు గ్రూపులు వినియోగించుకోవాలన్నారు. దరఖాస్తు కొరకు సమీప ఉద్యాన అధికారిని లేదా ఉద్యాన సహాయ సంచాలకులను సంప్రదించాలన్నారు.