ప్రధాన సమస్యలపై దృష్టి సారించాలి
ABN , First Publish Date - 2021-04-18T05:45:57+05:30 IST
నగరంలోని 37వ డివిజన్ పరిధిలో ఎప్పటి నుంచో ఉన్న ప్రధాన సమస్యలను సత్వరం పరిష్కరించాలని మున్సిపల్ అధికారులను డివిజన్ కార్పొరేటర్, పశ్చిమ టీడీపీ ఇన్చార్జి కోవెలమూడి రవీంద్ర కోరారు.
గుంటూరు, ఏప్రిల్ 17 (ఆంధ్రజ్యోతి): నగరంలోని 37వ డివిజన్ పరిధిలో ఎప్పటి నుంచో ఉన్న ప్రధాన సమస్యలను సత్వరం పరిష్కరించాలని మున్సిపల్ అధికారులను డివిజన్ కార్పొరేటర్, పశ్చిమ టీడీపీ ఇన్చార్జి కోవెలమూడి రవీంద్ర కోరారు. శనివారం ఆయన లక్ష్మీపురం, చంద్రమౌళినగర్లో అధికారులతో కలిసి పర్యటించారు. ప్రధానంగా యూజీడీ కోసం తవ్వి వదిలేసిన రోడ్లు, డ్రెయినేజి పనులను వెంటనే ప్రారంభించాలని కోరారు. కార్యక్రమంలో డీసీపీ సత్యనారాయణ, టీపీఎస్ లక్ష్మణస్వామి, ఏఈ అనూష, మాజీ కార్పొరేటర్ ముత్తినేని రాజేష్లో తదితరులు పాల్గొన్నారు.