హత్య కేసులో నలుగురి అరెస్టు

ABN , First Publish Date - 2021-05-11T03:57:14+05:30 IST

రాజకీయంగా అడ్డు తొలగించుకునేందుకే నాగముంతల అనిల్‌ను పథకం ప్రకారం హత్యచేశారని గూడూరు డీఎస్పీ రాజగోపాల్‌రెడ్డి తెలిపారు.

హత్య కేసులో నలుగురి అరెస్టు
మాట్లాడుతున్న డీఎస్పీ రాజగోపాల్‌రెడ్డి, సీఐ నరసింహరావులు

కోట, మే 10 : రాజకీయంగా అడ్డు తొలగించుకునేందుకే నాగముంతల అనిల్‌ను పథకం ప్రకారం హత్యచేశారని గూడూరు డీఎస్పీ రాజగోపాల్‌రెడ్డి తెలిపారు. కోట పోలీస్‌ స్టేషన్‌లో సోమవారం రాఘవాపురం ఘర్షణ కేసుకు సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు. ఈ నెల 6న గ్రామంలో ఓ వ్యక్తి కరోనాతో మృతి చెందగా, అంత్యక్రియలకు వెళ్లిన అనిల్‌, ప్రతాప్‌ అదే గ్రామానికి చెందిన అంకయ్య పొలంలోని బావిలో స్నానాలు చేశారు. ఈ విషయంపై వారు ఘర్షణ పడ్డారు. ఎంపీటీసీ ఎన్నికల్లో అనిల్‌ తమకు వ్యతిరేకంగా పనిచేశాడన్న అభిప్రాయంతో అప్పటికే కక్ష పెంచుకున్న నిందితులు ఈ ఘర్షణ సాకుతో ఈ నెల 7న నడుచుకుంటూ ఇంటికి వెళుతున్న అనిల్‌పై కత్తులతో దాడి చేసి హత్య చేశారు. దాడిని అడ్డుకునేందుకు యత్నించిన జగ్గయ్య, రహీముల్లా, కల్యాణ్‌పై కూడా దాడి చేసి గాయపరిచారు.  వాకాడు సీఐ నరసింహరావు సోమవారం నిందితుల్లో నలుగురిని అరెస్టు చేశారు. ఒక వ్యక్తి నెల్లూరులో చికిత్స పొందుతుండగా, మరొకరు కరోనాతో బాధపడుతున్నాడని డీఎస్పీ వివరించారు. ఎస్‌ఐ మహేంద్ర, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు. 


Updated Date - 2021-05-11T03:57:14+05:30 IST