పుల్వామాలో పోలీస్ టీమ్పై ఉగ్రవాదుల దాడి
ABN , First Publish Date - 2021-09-14T21:15:52+05:30 IST
జమ్మూకశ్మీర్లోని పుల్వామా జిల్లాలో ఉగ్రవాదులు మరోసారి దాడికి దిగారు. పోలీసు గస్తీ..
శ్రీనగర్: జమ్మూకశ్మీర్లోని పుల్వామా జిల్లాలో ఉగ్రవాదులు మరోసారి దాడికి దిగారు. పోలీసు గస్తీ వాహనంపై గ్రనేడ్ దాడి చేశారు. మంగళవారం మధ్యాహ్నం పుల్వామాలోని మెయిన్ చౌక్ వద్ద జరిగిన ఈ దాడిలో నలుగురు పౌరులు గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే సమీప ఆసుపత్రికి తరలించారు. దాడి జరిగిన ప్రాంతాన్ని బలగాలు తమ అధీనంలోకి తీసుకుని ఉగ్రవాదుల కోసం గాలిస్తున్నారు. కశ్మీర్ లోయలో ఇటీవల కాలంలో గ్రనేడ్ దాడి ఘటనలు పెరుగుతున్నాయి. గత వారంలో శ్రీనగర్లోని చనాపోరా ప్రాంతంలో ఉగ్రవాదులు జరిపిన గ్రనేడ్ దాడిలో ఇద్దరు మహిళలతో సహా ముగ్గురు గాయపడ్డారు. కాగా, సోమవారంనాడు నేషనల్ హైవే 44పై అమర్చిన 6 చైనా గ్రనేడ్లను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఈ గ్రనేడ్లను ఒక ఇసుక బస్తాలో కనుగొన్నారు.