మహిళను కిడ్నాప్ చేసి.. బలవంతంగా మందు తాపించి..

ABN , First Publish Date - 2021-02-22T10:35:35+05:30 IST

ఓ 20ఏళ్ల యువతిని కిడ్నాప్ చేసి బలవంతంగా మందు తాపించి సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కలకలం రేపింది. షాహడోల్ జిల్లాలో జరిగిన ఈ ఘటనపై పోలీసు దర్యాప్తు జరుగుతోంది.

మహిళను కిడ్నాప్ చేసి.. బలవంతంగా మందు తాపించి..

భోపాల్: ఓ 20ఏళ్ల యువతిని కిడ్నాప్ చేసి బలవంతంగా మందు తాపించి సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కలకలం రేపింది. షాహడోల్ జిల్లాలో జరిగిన ఈ ఘటనపై పోలీసు దర్యాప్తు జరుగుతోంది. ఇక్కడ ఓ యువతిని కిడ్నాప్ చేసిన నలుగురు దుండగులు.. ఆమెను ఓ ఫార్మ్‌హౌస్‌కు తీసుకెళ్లి బలవంతంగా మద్యం తాగించారు. ఆ తర్వాత ఆమెపై సామూహికంగా అత్యాచారం చేశారు. ఈ నెల 18-19 తేదీల్లో ఆమెను బలాత్కరించిన దుండగులు.. శనివారం నాడు ఆమె ఇంటిముందే వదిలేసి వెళ్లారు. తనకు జరిగిన అవమానాన్ని పోలీసులకు చెప్పిన ఆమె వేదన విన్న అధికారులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.

Updated Date - 2021-02-22T10:35:35+05:30 IST