అగ్రరాజ్యంలో మళ్లీ పేలిన తూటా.. నలుగురు మృతి!
ABN , First Publish Date - 2021-06-08T17:23:33+05:30 IST
అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. పోర్ట్ల్యాండ్లోని ఒరెగాన్లో ఓ ఇంట్లో జరిగిన కాల్పుల్లో నలుగురు మృతిచెందారు.
పోర్ట్ల్యాండ్, ఒరెగాన్: అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. పోర్ట్ల్యాండ్లోని ఒరెగాన్లో ఓ ఇంట్లో జరిగిన కాల్పుల్లో నలుగురు మృతిచెందారు. ఆదివారం రాత్రి 10.25 గంటల(అమెరికా కాలమానం ప్రకారం) ప్రాంతంలో ఈ కాల్పులు చోటు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వీకెండ్ సందర్భంగా ఓ ఇంట్లో జరిగిన పార్టీలో ఈ ఘటన జరిగినట్లు పోలీస్ అధికారి లెఫ్టినెంట్ గ్రెగ్ పాష్లే వెల్లడించారు. ఈ ఘటన సమయంలో ఇంట్లో సుమారు 20 నుంచి 30 మంది వరకు ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై దర్యాప్తు ముమ్మరం చేసినట్లు, త్వరలోనే నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకుంటామని గ్రెగ్ పాష్లే పేర్కొన్నారు.