అమెరికాలో అమానుష ఘటన.. 4ఏళ్ల చిన్నారితో నాయనమ్మ బలవంతంగా విస్కీ తాగించి..

ABN , First Publish Date - 2022-04-23T17:21:46+05:30 IST

అగ్రరాజ్యం అమెరికాలో అమానుష ఘటన చోటు చేసుకుంది.

అమెరికాలో అమానుష ఘటన.. 4ఏళ్ల చిన్నారితో నాయనమ్మ బలవంతంగా విస్కీ తాగించి..

బాటన్ రౌగ్, లూసియానా: అగ్రరాజ్యం అమెరికాలో అమానుష ఘటన చోటు చేసుకుంది. ఓ నాలుగేళ్ల చిన్నారికి ఆమె నాయనమ్మ బలవంతంగా ఒక బాటిల్ విస్కీ తాగించడంతో చనిపోయింది. ఈ దుర్ఘటన లూసియానా రాష్ట్రం బాటన్ రౌగ్​ ప్రాంతంలో గురువారం జరిగింది. కాగా, ఘటన సమయంలో ఆమె తల్లి అక్కడే ఉన్నా చూస్తూ ఊరుకోవడంతో ఆ చిన్నారి మృతిచెందింది. ఇంట్లో చిన్నారి అచేతనంగా పడి ఉండడం చూసి పక్కింటివాళ్లు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అక్కడికి వచ్చిన పోలీసులు చిన్నారిని ఆస్పత్రికి తరలించారు. కానీ, అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు వెల్లడించారు. 


దాంతో పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులు రోక్సాన్నే రికార్డ్​ (53), కాద్జా రికార్డ్​గా (29)ను పోలీసులు విచారిస్తున్నారు. మృతిచెందిన చిన్నారిని చైనా రికార్డ్​ (4)గా గుర్తించారు. పోస్ట్​మార్టం రిపోర్టులో చిన్నారి శరీరంలో బ్లడ్​ అల్కాహాల్​ లెవెల్​ 0.680 శాతం ఉన్నట్లు తేలింది. పెద్దల్లో ఇది అత్యధికంగా 0.08 శాతం మాత్రమే ఉంటుంది. కానీ, చిన్నారి శరీరంలో దానికి ఎనిమిది రెట్లు ఎక్కువ ఉందని బాటన్ రౌగ్​ పోలీసులు పేర్కొన్నారు. 

Updated Date - 2022-04-23T17:21:46+05:30 IST