40ఏళ్ల టీచర్ 20ఏళ్ల స్టూడెంట్.. ఇంట్లోంచి పారిపోయి పెళ్లి చేసుకున్నారు.. చివరికి ఏం జరిగిందంటే..

ABN , First Publish Date - 2022-02-10T23:13:48+05:30 IST

అతడికి 40ఏళ్లు. ఇంటింటికీ వెళ్లి ట్యూషన్లు చెప్తుంటాడు. ఈ క్రమంలోనే ఓ అమ్మాయికి అతడికి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. చివరికి అదే ప్రేమగా మారింది. తాజాగా ఆ ప్రేమికులు కీలక నిర్ణయం తీసుకున్నారు

40ఏళ్ల టీచర్ 20ఏళ్ల స్టూడెంట్.. ఇంట్లోంచి పారిపోయి పెళ్లి చేసుకున్నారు.. చివరికి ఏం జరిగిందంటే..

ఇంటర్నెట్ డెస్క్: అతడికి 40ఏళ్లు. ఇంటింటికీ వెళ్లి ట్యూషన్లు చెప్తుంటాడు. ఈ క్రమంలోనే ఓ అమ్మాయికి అతడికి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. చివరికి అదే ప్రేమగా మారింది. తాజాగా ఆ ప్రేమికులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇంట్లోంచి పారిపోయి పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత ఏం జరిగిందనే వివరాల్లోకి వెళితే..


రాజస్థాన్‌లోని భరత్‌పూర్ జిల్లాకు చెందిన సాత్వీర్‌కు ప్రస్తుతం 40ఏళ్లు. సాత్వీర్‌కు మరో ఇద్దరు సోదరులు కూడా ఉన్నారు. అందరి కంటే సాత్వీర్ పెద్దవాడు. దీంతో కుటుంబ బాధ్యతలను తన భుజాలపై వేసుకున్నాడు. ఈ క్రమంలోనే కాలేజీలో ఇంగ్లిష్ లెక్చరర్‌గా పని చేస్తూనే.. ట్యూషన్లు చెప్తూ డబ్బులు సంపాదించేవాడు. ఆ తర్వాత కాలేజీలో ఉద్యోగాన్ని మానేసి.. జాంతర్ అనే గ్రామంలో ఇంటింటికీ వెళ్లి ట్యూషన్లు చెప్పడం ప్రారంభించాడు. ఈ క్రమంలోనే సోనియా అనే 20 ఏళ్ల యువతి పరిచయం అయింది. డిగ్రీ పూర్తి చేసుకుని, బీ.ఈడీ కోసం ప్రిపేర్ అవుతున్న సోనియా.. సాత్వీర్ దగ్గర ట్యూషన్లో చేరింది.



 ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. అదికాస్తా ప్రేమగా మారింది. తాజాగా ఇద్దరూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇంట్లోంచి పారిపోయి అజ్మిర్‌ కోర్టులో పెళ్లి చేసుకున్నారు. అయితే సోనియా కనిపించకపోవడంతో ఆమె తల్లిదండ్రులు కంగారుపడ్డారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో సోనియా, సాత్వీర్ ఇద్దరూ భరత్‌పూర్‌లోని సబ్ డివిజినల్ మెజిస్ట్రేట్‌కు చేరుకున్నారు. పోలీసుల సమక్షంలో తామిద్దరం కలిసే ఉండనున్నట్టు తేల్చి చెప్పడంతో.. సోనియా తల్లిదండ్రులు నిరాశగా అక్కడ నుంచి వెనుదిరిగారు. కాగా.. ఘటన స్థానికంగా చర్చనీయాంశం అయింది.




Updated Date - 2022-02-10T23:13:48+05:30 IST