415 మందికి Covid పాజిటివ్
ABN , First Publish Date - 2022-06-14T16:12:09+05:30 IST
రాష్ట్రంలో కొవిడ్ కేసులు మరోరోజు కూడా 400కుపైగానే నమోదయ్యాయి. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా 415 మందికి పాజిటివ్ నిర్ధారణ కాగా బెంగళూరులోనే
బెంగళూరు, జూన్ 13 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కొవిడ్ కేసులు మరోరోజు కూడా 400కుపైగానే నమోదయ్యాయి. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా 415 మందికి పాజిటివ్ నిర్ధారణ కాగా బెంగళూరులోనే 400 మంది ఉన్నారు. దక్షిణకన్నడలో 5, కలబురగి 3, బళ్లారి 2, బెళగావి, ధారవాడ, కోలారు, శివమొగ్గ, ఉత్తరకన్నడలో ఒక్కొక్కటి నమోదయ్యాయి. 378 మంది కోలుకున్నారు. గడిచిన 24 గంటల్లో ఎవరూ మృతి చెందలేదు. రాష్ట్రంలో 3,688 మంది చికిత్సలు పొందుతుండగా బెంగళూరులో 3,542 మంది ఉన్నారు.