48 సీసాల మద్యం పట్టివేత
ABN , First Publish Date - 2021-05-11T03:42:16+05:30 IST
అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని ఇందుకూరుపేట డివిజన్ సెబ్ ఇన్స్పెక్టర్ కేబీ కిషోర్ దాడి చేసి పట్టుకున్నారు. సోమవారం తోట
తోటపల్లిగూడూరు, మే 10 : అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని ఇందుకూరుపేట డివిజన్ సెబ్ ఇన్స్పెక్టర్ కేబీ కిషోర్ దాడి చేసి పట్టుకున్నారు. సోమవారం తోటప ల్లిగూడూరు మండలంలో తనిఖీలు నిర్వహించారు. ఈసందర్భంగా వరకవిపూడి ప్రాంతంలో జే ఏడుకొండలు అనే వ్యక్తి ద్విచక్ర వాహనంలో అక్రమంగా తరలిస్తున్న 48 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు ఏడుకొండలను అరెస్టు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ కిషోర్ తెలిపారు.