హర్యానాలో విజృంభిస్తున్న కరోనా.. 17,504కి పెరిగిన కేసులు..

ABN , First Publish Date - 2020-07-07T05:15:22+05:30 IST

హర్యానాలో కరోనా మహమ్మారి మరింత తీవ్ర రూపం దాల్చుతోంది. ఇవాళ ఒక్కరోజే ఇక్కడ మరో...

హర్యానాలో విజృంభిస్తున్న కరోనా.. 17,504కి పెరిగిన కేసులు..

చండీగఢ్: హర్యానాలో కరోనా మహమ్మారి మరింత తీవ్ర రూపం దాల్చుతోంది. ఇవాళ ఒక్కరోజే ఇక్కడ మరో 499 మందికి కరోనా పాజిటివ్ ఉన్నట్టు నిర్ధారించారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కొవిడ్-19 కేసుల సంఖ్య 17,504కి పెరిగింది. మరోవైపు ఇవాళ 11 మంది ప్రాణాలు కోల్పోవడంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 276కు చేరింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 3,893 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతుండగా... 13,335 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో రికవరీ రేటు ఇవాళ 76.18 శాతంగా ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. 

Updated Date - 2020-07-07T05:15:22+05:30 IST