ఆమె 5.5 అడుగులు... అతను 3 ... కలసి 7 అడుగులు!

ABN , First Publish Date - 2020-12-02T17:10:13+05:30 IST

ఆమె 5.5 అడుగులు... అతను 3 ... కలసి 7 అడుగులు!

ఆమె 5.5 అడుగులు... అతను 3 ... కలసి 7 అడుగులు!

జూనాగఢ్: కరోనా కాలంలో పలు నిబంధనల మధ్య దేశంలోని పలు ప్రాంతాలలో పెళ్లి వేడుకలు జరుగుతున్నాయి. అయితే వీటిలో కొన్ని ఆసక్తిగొలిపే వివాహాలు కూడా ఉంటున్నాయి. వాటిలో ఒకటే గుజరాత్‌లోని జూనాగఢ్‌లో జరిగిన వివాహం. ఇది స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళితే 5.5 అడుగుల ఎత్తు కలిగిన యువతి, 3 అడుగుల ఎత్తు కలిగిన యువకుడిని వివాహం చేసుకున్నారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఆ యువతి పేరు శాంతా మక్వాణా(29) ఆమె ఒక హాస్టల్‌లో ఉంటున్నారు. ఆమె పుట్టుకతోనే అంధురాలు. 


అయితే ఈ లోపం కారణంగా ఆమె చదువుకు ఆటకం కాలేదు. బీఈడీ పూర్తి చేశారు. ఇక వరుని విషయానికొస్తే అతని పేరు రమేస్ భాయీ డాంగర్(42). ఆయన ప్రభుత్వ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నారు. రమేష్‌కు ఎవరి ద్వారానో శాంతా గురించి తెలిసింది. దీంతో ఆమెను కలుసుకుని పెళ్ళికి ప్రతిపాదించారు. ఈ వివాహానికి ఆమె ఒప్పుకున్నారు. దీంతో వీరిద్దరికీ నవంబరు 30న వివాహం జరిగింది. ఈ పెళ్లికి హాజరైనవారంతా వధూవరులను మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు.

Updated Date - 2020-12-02T17:10:13+05:30 IST