జూలై 31 లోగా చెల్లిస్తే 5 శాతం తగ్గింపు
ABN , First Publish Date - 2022-06-28T02:54:20+05:30 IST
Amaravathi: జగన్ ప్రభుత్వం ఆదాయ వనరుల కోసం తీవ్రంగా అన్వేషిస్తోంది. తమ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని విదేశాలకు వెళ్లే బడా పారిశ్రామికవేత్తలను
Amaravathi: జగన్ ప్రభుత్వం ఆదాయ వనరుల కోసం తీవ్రంగా అన్వేషిస్తోంది. తమ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని విదేశాలకు వెళ్లే బడా పారిశ్రామికవేత్తలను ఆహ్వానిస్తోంది. వచ్చే వారికి పలు రాయితీలు కల్పిస్తోంది. ప్రస్తుతం ఆదాయాన్ని సమకూర్చుకోవడం కోసం మరో మార్గం ఎంచుకుంది. పాత బకాయిలు, వడ్డీలు, ప్రస్తుత ఆస్తిపన్ను ఒకేసారి చెల్లించేవారికి 5 శాతం తగ్గిస్తామని ఆఫర్ ఇచ్చింది. ఈ ఆఫర్ వర్తించాలంటే జూలై 31 లోగా చెల్లించాలని కండీషన్ కూడా పెట్టింది. ఏపీఐఐసీ బోర్డు మీటింగ్లో ఈ నిర్ణయం తీసుకున్నారు.