కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు భారత విద్యార్థులు మృతి

ABN , First Publish Date - 2022-03-14T13:48:15+05:30 IST

కెనడాలో దారుణం చోటు చేసుకుంది. ఉన్నత చదువుల కోసం కెనడా వెళ్లిన ఐదుగురు భారత విద్యార్థులు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ దుర్ఘటనలో ఐదుగురు విద్యార్థులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా..

కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు భారత విద్యార్థులు మృతి

ఎన్నారై డెస్క్: కెనడాలో దారుణం చోటు చేసుకుంది. ఉన్నత చదువుల కోసం కెనడా వెళ్లిన ఐదుగురు భారత విద్యార్థులు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ దుర్ఘటనలో ఐదుగురు విద్యార్థులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరో ఇద్దరు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. కెనడాలోని భారత కమిషనర్ అజయ్ బిసారియా ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. గాయపడ్డ విద్యార్థులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని పేర్కొన్నారు. టొరెంటో ప్రాంతంలో శనివారం తెల్లవారుజామున 3.45 గంటలకు విద్యార్థులు ప్రయాణిస్తున్న వాహనాన్ని మరో వాహనం ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టు చెప్పారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదంలో మృతి చెందిన విద్యార్థుల పేర్లను ఓంటారియో ప్రోవిన్సియల్ పోలీస్ అధికారులు మీడియాకు వెల్లడించారు. దుర్ఘటనలో హర్‌ప్రీత్ సింగ్, జస్పిందర్ సింగ్, కరణ్‌పాల్ సింగ్, మోహిత్ చౌహాన్, పవన్ కుమార్ ప్రాణాలు కోల్పోయినట్టు పేర్కొన్నారు. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించినట్టు అధికారులు తెలిపారు. 




Updated Date - 2022-03-14T13:48:15+05:30 IST