స్వీట్‌ షాప్‌లోకి వెళ్లొచ్చేసరికి.. రూ.5.08 లక్షలు చోరీ

ABN , First Publish Date - 2022-05-31T12:15:31+05:30 IST

బైక్‌ కవర్‌లో పెట్టిన రూ.5.08 లక్షలు దొంగలు అపహరించారు..

స్వీట్‌ షాప్‌లోకి వెళ్లొచ్చేసరికి.. రూ.5.08 లక్షలు చోరీ

మచిలీపట్నం టౌన్‌ : బైక్‌ కవర్‌లో పెట్టిన రూ.5.08 లక్షలు దొంగలు అపహరించారు. విజయవాడకు (Vijayawada) చెందిన వ్యాపారి బొమ్మిశెట్టి భాస్కరరావు తన స్నేహితుడు కుమార్‌ సింగ్‌తో కలిసి మచిలీపట్నం వచ్చారు. స్టేట్‌ బ్యాంకు (State Bank) మెయిన్‌ బ్రాంచ్‌లో రూ. 5 లక్షల 8 వేలు డ్రా చేసి విజయవాడ వెళుతూ కోనేరుసెంటరులో ఆగారు. భాస్కరరావు స్వీట్‌ షాపులోకి వెళ్లగా.. కుమార్‌ సింగ్‌ కూల్‌ డ్రింక్‌ షాపునకు వెళ్లాడు. ఇద్దరు దుండగులు బైక్‌ ట్యాంక్‌ కవర్‌లో ఉన్న డబ్బును తీసుకుని పరారయ్యారు. బాధితుడు భాస్కరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐ ఉమామహేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2022-05-31T12:15:31+05:30 IST