J&K: జైషే కమాండర్ సహా ఐదుగురు ఉగ్రవాదులు హతం
ABN , First Publish Date - 2022-01-30T16:06:00+05:30 IST
జమ్మూ కశ్మీర్లో తాజాగా జరిగిన ఎన్కౌంటర్లో లష్కరే తోయిబా, జైషే మహ్మద్ సంస్థలకు చెందిన ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారని జమ్మూ కశ్మీర్ పోలీసులు ఆదివారం పేర్కొన్నారు. రాష్ట్రంలోని పుల్వామా, బుడ్గాం జిల్లాలో ఉగ్రవాదులకు భద్రతా దళాలకు మధ్య ఎన్కౌంటర్ జరిగిందని వారు పేర్కొన్నారు..
శ్రీనగర్: జమ్మూ కశ్మీర్లో తాజాగా జరిగిన ఎన్కౌంటర్లో లష్కరే తోయిబా, జైషే మహ్మద్ సంస్థలకు చెందిన ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారని జమ్మూ కశ్మీర్ పోలీసులు ఆదివారం పేర్కొన్నారు. రాష్ట్రంలోని పుల్వామా, బుడ్గాం జిల్లాలో ఉగ్రవాదులకు భద్రతా దళాలకు మధ్య ఎన్కౌంటర్ జరిగిందని వారు పేర్కొన్నారు. కాగా, మరణించిన ఉగ్రవాదులు ఒకరు జైషే మహ్మద్ సంస్థ కమాండర్ జహిద్ వని ఉన్నట్లు తెలిపారు. 2019 ఫిబ్రవరి 14న పుల్వామాలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లను పొట్టనపెట్టుకున్న దారుణ ఘటనలో జహిద్ వని ప్రమేయం ఉందని పోలీసులు తెలిపారు. జహిద్ వనితో పాటు తాజాగా మరణించిన మిగతా ఉగ్రవాదులను కూడా గుర్తించారు. ముగ్గురు వహిద్ అహ్మద్ రిషి, కఫీల్, ఇనాయుతుల్లా అని మిగతా ఒక ఉగ్రవాది వివరాలు ఇంకా తెలియలేదని చెప్పారు. శనివారం సాయంత్రం కశ్మీర్ జోన్ పోలీసులకు ఉగ్రవాదులకు మధ్య పుల్వామాలోని నైరా ప్రాంతంలో ఎన్కౌంటర్ జరిగింది.