వారానికి 5 పని దినాలు.. మరో ఏడాది పొడిగింపు
ABN , First Publish Date - 2022-07-01T08:22:48+05:30 IST
వారానికి 5 పని దినాలు.. మరో ఏడాది పొడిగింపు
అమరావతి, జూన్ 30(ఆంధ్రజ్యోతి): అమరావతి సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాల్లో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులకు వారానికి ఐదు పని దినాల విధానాన్ని ప్రభుత్వం మరో ఏడాది పొడిగించింది. సీఎస్ సమీర్శర్మ గురువారం ఈ ఉత్తర్వులిచ్చారు. జూన్ 27నుంచి మరో ఏడాది పాటు ఈ విధానాన్ని కొనసాగనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.