మండలానికి 500 ఐసోలేషన్‌ కిట్లు

ABN , First Publish Date - 2021-05-11T03:46:44+05:30 IST

మండలంలోని 18 పంచాయతీల్లో 500 ఐసోలేషన్‌ కిటు ్లపంపిణీ చేసినట్లు డివిజనల్‌ పంచాయతీ అధికారి వెంకటరమణ తెలిపారు.

మండలానికి 500 ఐసోలేషన్‌ కిట్లు

 పారిశుధ్య పరిరక్షణకు ప్రత్యేక చర్యలు 

 డీఎల్‌పీవో వెంకటరమణ 

నాయుడుపేట టౌన్‌, మే 10 : మండలంలోని 18 పంచాయతీల్లో 500 ఐసోలేషన్‌ కిటు ్లపంపిణీ చేసినట్లు డివిజనల్‌ పంచాయతీ అధికారి వెంకటరమణ తెలిపారు. మండలంలోని తిమ్మాజికండ్రిగ గ్రామంలో సోమవారం వాటితోపాటు, పారిశుధ్య కార్మికులకు పీపీఈ కిట్లు పంపిణీ చేశారు. మేనకూరు పంచాయతీలో పారిశుధ్య పనులను పరిశీలించారు. గ్రామాల్లో  పారిశుధ్య పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. మేనకూరులో సెజ్‌ ఉండటంతో  పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు వివరించారు. సర్పంచ్‌లు ప్రకాష్‌, సురేష్‌, డీఆర్‌పీజీ  వెంకటరావు, ఈవోపీఆర్‌డీ సుమతి, కార్యదర్శులు గోపాల్‌, కిరణ్‌, నాయకులు కట్టా రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-05-11T03:46:44+05:30 IST